గ్రామాల అభివృదే లక్ష్యం

ABN , First Publish Date - 2020-07-03T11:23:03+05:30 IST

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

గ్రామాల అభివృదే లక్ష్యం

జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి


గట్టు, జూలై 2 : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని తుమ్మలచెర్వు, వాయిల్‌కుంట తండా, మాచర్ల గ్రామాల్లో గురువారం వారు పర్యటించారు. వాయిలకుంటతండాలో బీటీ రోడ్డును ప్రారంభించారు. తుమ్మలచెర్వులో గ్రామపంచాయితీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. వైకుంఠధామాన్ని ప్రారంభించారు. మాచర్లలో రైతు వేదిక, గ్రామపంచాయితీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు.


పాఠశాల భవనంలో నూతన సదుపాయాల కల్పన పనులను ప్రారంభించారు.  కార్యక్రమంలో ఎంపీపీ విజయ్‌, జెడ్పీటీసీ శ్యామల, పీఏసీయస్‌ అధ్యక్షుడు క్యామ వెంకటేశ్‌, సర్పంచ్‌లు అనిత, సిద్ధిరామప్ప, కేతావత్‌ కృష్ణవేణి, హనుమంతునాయుడు ఎంపీటీసీ షమీమాబేగం తదితరులు పాల్గొన్నారు. 


ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తుమ్మల చెరువుకు చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త అంజనేయులు కుటుంబ సభ్యులకు రైతు బీమా చెక్కును జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అందించారు. 

Updated Date - 2020-07-03T11:23:03+05:30 IST