నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం
ABN , First Publish Date - 2022-05-28T05:13:15+05:30 IST
నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం
- జేబీఐటీ కార్యదర్శి జేవీ కృష్ణారావు
మొయినాబాద్ రూరల్, మే27: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయమని జేబీఐటీ విద్యాసంస్థలకార్యదర్శి జేవీ కృష్ణారావు తెలిపారు. జేబీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో రెండురోజుల పాటు జరిగే కల్చరల్, టెక్నిల్ 2022-ఫెస్టివల్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ వేడుకల్లో కృష్ణారావు మాట్లాడుతూ విద్యతో పాటు సంస్కృతీ సంప్రదాయాలు, క్రీడలతో పాటు ఇతర సదుపాయాలను విద్యార్థులకు కల్పిస్తున్నట్లు తెలిపారు. వారి ప్రతిభను బట్టి ఆయా రంగాల్లో రాణించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్బంగా విద్యార్థులు చేపట్టిన కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమాచారి, సీఏ రాజశేఖర్రెడ్డి, ఫెస్ట్ ఇన్చార్జ్ కృష్ణ, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.