పోలీసు అధికారుల సంరక్షణే లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-19T05:28:04+05:30 IST

పోలీసు అధికారుల సంరక్షణే లక్ష్యం

పోలీసు అధికారుల సంరక్షణే లక్ష్యం
బదిలీపై వెళుతున్న పోలీసులతో మాట్లాడుతున్న ఎస్పీ కోటిరెడ్డి

 వికారాబాద్‌, మే 18 : జిల్లాలోని పోలీసు అధికారుల సంరక్షణే తమ లక్ష్యమని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం ఒక పోలీస్‌స్టేషన్‌ నుంచి మరో పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వెళుతున్న హెడ్‌కానిస్టేబుల్‌, ఏఎస్‌ఐలకు పోస్టింగ్‌ ఇచ్చి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ బదిలీపై వెళ్లిన తర్వాత ఆయా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్రజలు, పరిసర ప్రాంతాలపట్ల అవగాహన కలిగి ఉండాలని, నిరంతరం ప్రజల్లో ఉంటూ వివిధ విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. నిరంతరం కష్టపడి పనిచేస్తున్న సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పోలీస్‌ సిబ్బంది యోగక్షేమాల కొరకు అధికారులు ఎల్లప్పుడూ అండగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రషీద్‌, ఏవో వందన, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ అయ్యప్ప, పోలీస్‌ సంఘం అధ్యక్షుడు అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T05:28:04+05:30 IST