ఘనంగా ఫలహార బండి ఊరేగింపు
ABN , First Publish Date - 2021-07-27T04:47:54+05:30 IST
ఘనంగా ఫలహార బండి ఊరేగింపు
శంషాబాద్/ ఇబ్రహీంపట్నం: బోనాల పండుగ ముగింపు సందర్భంగా మధురానగర్ పోచమ్మతల్లి ఆలయంలో సోమవారం ఫలహార బండి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాల నడుమ ఉరేగింపు కొనసాగింది. అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు ముద్దం మల్లారెడ్డి, సంతో్షరెడ్డి, శ్రీనివాస్, ప్రసాద్, రాములు, సిద్దేశ్వర్గౌడ్, కృష్ణ, నర్సింహ, దేవేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం టౌన్లో మహంకాళి బోనాల సందర్భంగా సోమవారం ఫలహారం బండి ఊరేగింపులో టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి, చిలుక మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు శివకృష్ణగౌడ్, గుండ్ల వెంకట్రెడ్డి, కప్పాటి రఘు, రాఘవేందర్రెడ్డి తదితరులున్నారు.