ట్యూషన్కు వచ్చిన బాలికను టార్గెట్ చేసిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో ఇలా చేస్తాడని ఊహించలేదు..
ABN , First Publish Date - 2022-02-24T00:10:41+05:30 IST
రాజస్థాన్లో ట్యాషన్ కోసం వచ్చిన బాలికను ఓ వ్యక్తి టార్గెట్ చేశాడు. చదువు నేర్పించాల్సింది పోయి చనువుగా ఉండడం మొదలెట్టాడు. మాయమాటలు చెప్పి మోసం చేయాలని చూశాడు. చివరికి జరిగిన దారుణం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు..
బాలికలు, యువతులు, మహిళలపై ఇటీవల దాడులు పెరిగిపోతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, మోసగాళ్ల మాయ మాటలు నమ్మినా చివరికి జీవితాలనే సర్వ నాశనం చేస్తుంటారు. ఇలాంటి దాడులు ఇటీవల మరీ ఎక్కువయ్యాయి. ఎక్కడో చోట ఏదో ఒక సందర్భంగా అమాయక బాలికలు, యువతులు మోసపోతూనే ఉన్నారు. రాజస్థాన్లో ట్యాషన్ కోసం వచ్చిన బాలికను ఓ వ్యక్తి టార్గెట్ చేశాడు. చదువు నేర్పించాల్సింది పోయి చనువుగా ఉండడం మొదలెట్టాడు. మాయమాటలు చెప్పి మోసం చేయాలని చూశాడు. చివరికి జరిగిన దారుణం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్లోని కోటా, రాంపురా ప్రాంతానికి చెందిన గౌరవ్ జైన్ అనే వ్యక్తి.. విద్యార్థులకు ట్యూషన్ చెబుతూ ఉంటాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ వ్యక్తి.. అందుకు విరుద్ధంగా తొమ్మిదో తరగతి చదివే బాలికపై కన్నేశాడు. ఈ క్రమంలో ఆమెతో చనువుగా ఉండేవాడు. అతడి వక్రబుద్ధిని గమనించని ఆ బాలిక.. గురువే కదా అని మాట్లాడుతూ ఉండేది. ఓ రోజు బాలిక ఒంటరిగా ట్యాషన్కి వచ్చిన క్రమంలో ఒక్కసారిగా బలవంతం చేయాలని చూశాడు. అనూహ్యంగా అతని బండారం బయటపడడంతో షాక్ అయిన బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహించిన గౌరవ్ జైన్ బాలికను గొంతు నులిమి చంపేశాడు.
పెళ్లయిన మూడో రోజే పుట్టింటికి వెళ్లిపోయిన నవవధువు.. భర్త బతిమిలాడినా నో రెస్పాన్స్.. ఆమె చెప్పింది విని..
తర్వాత బాలిక దుస్తులు వేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకుని, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివిధ నగరాల్లో పర్యటిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా తలదాచుకున్నట్లు గుర్తించారు. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.