నీరసంగా, భయంభయంగా కనిపిస్తున్న 7 ఏళ్ల బాలిక.. అనుమానంతో నాయనమ్మ ఆరా తీస్తే ఆ బాలిక చెప్పింది విని..

ABN , First Publish Date - 2022-07-16T17:29:35+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో...

నీరసంగా, భయంభయంగా కనిపిస్తున్న 7 ఏళ్ల బాలిక.. అనుమానంతో నాయనమ్మ ఆరా తీస్తే ఆ బాలిక చెప్పింది విని..

మధ్యప్రదేశ్‌లోని  గ్వాలియర్‌లో ఏడేళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన సమయంలో ఆ చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఇంటిలోని పెద్దాయన కాళ్లకు మసాజ్ చేసేందుకు వచ్చిన నడివయస్కుడు ఆ చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. తాటీపూర్ ద్వారకాధీష్ కాలనీలో ఈ సంఘటన జరిగింది. నీరసంగా, భయంభయంగా కనిపిస్తున్నఆ చిన్నారిని చూసి అనుమానంతో నాయనమ్మ కారణం అడిగింది. ఆ చిన్నారి జరిగిన విషయమంతా చెప్పింది.


దీంతో ఆ ఇంటిలోనివారంతా నిందితుడిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా, పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే తాటీపూర్‌లోని ద్వారకాధీష్ కాలనీలో నివాసం ఉంటున్న ఏడేళ్ల కాజల్ (పేరు మార్చాం) కుటుంబంతో కలిసి ఉంటోంది. కొంతకాలం క్రితం ఆమె తాతయ్యకు పక్షవాతం వచ్చింది. ఈ నేపధ్యంలో వైద్యుడి చికిత్సతో పాటు ఇంట్లోనే మసాజ్ చేయిస్తున్నారు. మహల్‌గావ్‌కు చెందిన కళ్యాణ్ రక్వార్ ఆ పెద్దాయనకు మసాజ్ చేయడానికి వచ్చేవాడు. రెండు రోజుల క్రితం ఆ చిన్నారి తల్లి దండ్రులు కూలి పనులకు వెళ్లగా ఇంట్లో నాయనమ్మ, తాతయ్య ఉన్నారు. తరువాత ఆమె నాయనమ్మ సమీపంలోని ఆలయానికి వెళ్లింది. ఈ సమయంలో నిందితుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక తన బాధను ఎవరికీ చెప్పలేదు. అయితే ఆ బాలిక నాయనమ్మ అనుమానంతో ప్రశ్నించగా విషయమంతా బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-16T17:29:35+05:30 IST