బాలిక అదృశ్యం

ABN , First Publish Date - 2022-05-25T05:47:07+05:30 IST

బాలిక అదృశ్యం

బాలిక అదృశ్యం

మొయినాబాద్‌, మే 24: బాలిక అదృశ్యమైన ఘటన పెద్దమంగళారం గ్రామంలో చోటుచేసుకుంది. పెద్దమంగళారం గ్రామానికి చెందిన ముత్యాల నర్సింగ్‌రావు కూతురు శిరీషకు 17సంవత్సరాల వయసులోనే మల్లాపూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో గత నెల 13న పెళ్లి చేశారు. కాగా వివాహం అయినప్పటి నుంచి శిరీష భర్తతో సరిగ్గా ఉండటం లేదు. వేరేవ్యక్తితో ఫోన్‌లో మాట్లాడం.. మెసేజ్‌ పెట్టడం వంటివి చేసింది. ఇది గమనించిన భర్త బాలిక తల్లిదండ్రులకు ఫోన్‌చేసి విషయాన్ని చెప్పాడు. ఈనెల 22న బాలికను పుట్టింట్లో వదిలివెళ్లాడు. అయితే ఈనెల 23న అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో బాలిక ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తెల్లవారేసరికి బాలిక కనిపించకపోవడంతో బాలిక తల్లి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-05-25T05:47:07+05:30 IST