బాలిక ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-07-01T11:36:50+05:30 IST
కడుపు నొప్పి భరించలేక ఓ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్మకు పాల్పడింది. ముల్కనూర్ ఎస్సై వెంకటరంగయ్యసూరి వివరాల ప్రకారం..
భీమదేవరపల్లి, జూన్ 30: కడుపు నొప్పి భరించలేక ఓ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్మకు పాల్పడింది. ముల్కనూర్ ఎస్సై వెంకటరంగయ్యసూరి వివరాల ప్రకారం.. మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన బైరవేన వర్ష(16) కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా తగ్గలేదు. దీంతో మనస్తాపానికి గురై సోమవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగింది. తల్లిదండ్రులు వరంగల్లోని ఓ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది.