‘వంశధార’ పూర్తి కావాల్సిందే
ABN , First Publish Date - 2021-04-11T05:31:45+05:30 IST
వంశధార పనులను పూర్తి చేయాలని సూచించినా జాప్యం చేయడంపై ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ శివరామప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచే శారు.
పనులు జాప్యంపై చీఫ్ ఇంజినీర్ ఆగ్రహం
వేరే వాళ్లకు అప్పగిస్తామని హెచ్చరిక
భామిని:వంశధార పనులను పూర్తి చేయాలని సూచించినా జాప్యం చేయడంపై ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ శివరామప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచే శారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా జూలై 15 నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. శనివారం నేరడి వద్ద వంశధార ప్రాజెక్టు స్టేజ్-1, ఫేజ్-1, 87, 88 ప్యాకేజీ పనులను పరిశీలించారు. కాట్రగడ ఓపెన్హెడ్ ఛానెల్, హెడ్ రెగ్యులేటర్, కాలువ లైనింగ్ పనులు, సింగిడి ఇన్ఫ్లో, బ్యాలెన్సింగ్ రెగ్యులేటర్, భామిని, దిమ్మిడిజోల లైనింగ్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పనులను పూ ర్తిచేస్తారా లేదా, లేకపోతే వేరే వారికి అప్పగించాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఆయనతో పాటు వంశధార ఎస్ఈ డోల తిరుమలరావు, ఏఈ రామచంద్రరావు, డీఈ భవానీశంకర్, సుశీలారాణి, జేఈ మురళీధర్ ఉన్నారు.