‘వంశధార’ పూర్తి కావాల్సిందే

ABN , First Publish Date - 2021-04-11T05:31:45+05:30 IST

వంశధార పనులను పూర్తి చేయాలని సూచించినా జాప్యం చేయడంపై ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్‌ శివరామప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తంచే శారు.

‘వంశధార’ పూర్తి కావాల్సిందే
నేరడి వద్ద పనులపై ప్రశ్నిస్తున్న చీఫ్‌ ఇంజినీర్‌

పనులు జాప్యంపై చీఫ్‌ ఇంజినీర్‌ ఆగ్రహం

 వేరే వాళ్లకు అప్పగిస్తామని హెచ్చరిక

భామిని:వంశధార పనులను పూర్తి చేయాలని సూచించినా  జాప్యం చేయడంపై ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్‌ శివరామప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తంచే శారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా జూలై 15 నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. శనివారం నేరడి వద్ద వంశధార ప్రాజెక్టు స్టేజ్‌-1, ఫేజ్‌-1, 87, 88 ప్యాకేజీ పనులను పరిశీలించారు. కాట్రగడ ఓపెన్‌హెడ్‌ ఛానెల్‌, హెడ్‌ రెగ్యులేటర్‌, కాలువ లైనింగ్‌ పనులు, సింగిడి ఇన్‌ఫ్లో, బ్యాలెన్సింగ్‌ రెగ్యులేటర్‌, భామిని, దిమ్మిడిజోల లైనింగ్‌ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పనులను పూ ర్తిచేస్తారా లేదా, లేకపోతే వేరే వారికి   అప్పగించాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఆయనతో పాటు వంశధార ఎస్‌ఈ డోల తిరుమలరావు, ఏఈ రామచంద్రరావు, డీఈ భవానీశంకర్‌, సుశీలారాణి, జేఈ మురళీధర్‌ ఉన్నారు. 

 

Updated Date - 2021-04-11T05:31:45+05:30 IST