స్వాతంత్య్ర ఫలాలు నిజమైన పేదవారికి అందాలి
ABN , First Publish Date - 2022-08-14T06:42:47+05:30 IST
స్వాతంత్య్ర ఫలాలు నిజమైన పేదవారికి అం దేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
రాయికల్, ఆగస్టు 13 :స్వాతంత్య్ర ఫలాలు నిజమైన పేదవారికి అం దేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయికల్ మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పా ర్టీ ఆధ్వర్యంలో ఆజాదీకి గౌరవ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కు మ్రం భీమ్ విగ్రహం నుంచి అంగడి బజార్, గాంఽధీ చౌక్, శివాజీ వి గ్రహం వరకు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు జాతీయ జెం డాలతో ర్యాలీ నిర్వహించారు.
ఆదివాసీ, గోండు సాంప్రదాయ నృత్యాలు చేసి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ర్యాలీలో హుషారుగా పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో మండంలోని అ న్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.