నెలాఖరులోగా మెడికల్‌ కళాశాలకు శంకుస్థాపన

ABN , First Publish Date - 2022-10-02T06:19:12+05:30 IST

ఈనెలఖారులోగా భీమబోయినపాలెంలో మెడికల్‌ కళాశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ అన్నారు.

నెలాఖరులోగా మెడికల్‌ కళాశాలకు శంకుస్థాపన
మెడికల్‌ కళాశాల స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గణేష్‌


నర్సీపట్నం ఎమ్మెల్యే  పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌

మాకవరపాలెం, అక్టోబర్‌ 1: ఈనెలఖారులోగా భీమబోయినపాలెంలో మెడికల్‌ కళాశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ అన్నారు. శనివారం భీమబోయినపాలెంలో వైద్య కళాశాల స్థలాన్ని ఆయన పరిశీలించారు. వైద్యకళాశాల భూమిని వైద్య కళాశాలల అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. నిర్మాణ పనులకు టెండరు పూర్తయిందన్నారు. శంకుస్ధాపన ఎప్పుడు చేస్తారని సైట్‌ ఇంజనీర్‌ రామకృష్ణారెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఈ నెలఖారు లోగా వైద్య కళాశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే గణేష్‌ తెలిపారు. ఇప్పటికే మెడికల్‌ కళాశాల స్థలంలో చెట్లు పూర్తిగా తొలగించడం జరిగిందన్నారు. ఆయన వెంట ఎంపీపీ సత్యనారాయణ, వైసీపీ మండల అధ్యక్షుడు వాసు, వైసీసీ నాయకులు ఉన్నారు. 


Updated Date - 2022-10-02T06:19:12+05:30 IST