ఆగస్టులోపు అయోధ్య ఆలయ పునాది పూర్తి

ABN , First Publish Date - 2022-05-18T08:09:51+05:30 IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతున్నాయి.

ఆగస్టులోపు అయోధ్య ఆలయ పునాది పూర్తి

న్యూఢిల్లీ, మే 17: అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతున్నాయి. గ్రానైట్‌ రాయితో జరుగుతున్న పునాది నిర్మాణం ఈ ఏడాది ఆగస్టులోపు పూర్తవుతుందని రామ మందిర నిర్మాణ కమిటీ తెలిపింది. ఈ పునాది నిర్మాణానికి దాదాపు 17 వేల రాళ్లు వాడతామని కమిటీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందు కోసం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ నుంచి నాణ్యమైన రాయి తెప్పిస్తున్నామని, కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, రైల్వే మంత్రిత్వశాఖ ఆ రాళ్ల  రవాణాకు ఇతోధికంగా సాయపడుతున్నాయని వెల్లడించింది.

Updated Date - 2022-05-18T08:09:51+05:30 IST