కరోనా సంగతి మరిచిపోయిన గ్రామస్తులు

ABN , First Publish Date - 2020-05-15T17:25:49+05:30 IST

కరోనా కట్టడికి భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడమే..

కరోనా సంగతి మరిచిపోయిన గ్రామస్తులు

రామనగర (కర్ణాటక): కరోనా కట్టడికి భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడమే మార్గమని ఎన్నిసార్లు చెప్పినా కొందరిలో మార్పు రావడంలేదు. తాజాగా కర్ణాటకలోని ఓ గ్రామస్తులు దేశంలో కరోనా అనే రోగం ఉందన్న విషయమే మరిచిపోయారు. గ్రామంలో జరిగే జాతర కోసం ఆ ఊరంతా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. వందల సంఖ్యలో ఒక చోట చేరి పండగ చేసుకున్నారు. సామాజక దూరం సరేసరి.. కనీసం మాస్క్ కూడా ధరించలేదు. రామనగరలోని కోలగొండనపల్లిలో ఈ ఘటన జరిగింది. ఈ పండగ తతంగానికి గ్రామ పంచాయతీ అధికారి కూడా అనుమతి ఇచ్చారు. కొందరు స్థానికుల ఫిర్యాదుతో ఆ అధికారిని సస్పెండ్ చేశారు.

Updated Date - 2020-05-15T17:25:49+05:30 IST