అప్పుల బాధతో ఇద్దరు యువకుల బలవన్మరణం

ABN , First Publish Date - 2021-06-20T06:03:57+05:30 IST

మెదక్‌ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన సంఘటనల్లో అప్పుల బాధతో ఇద్దరు యువకులు బలవన్మరణం చెందారు.

అప్పుల బాధతో  ఇద్దరు యువకుల బలవన్మరణం

కొల్చారం/చిన్న శంకరంపేట, జూన్‌ 19: మెదక్‌ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన సంఘటనల్లో  అప్పుల బాధతో ఇద్దరు యువకులు బలవన్మరణం చెందారు. వివరాల్లో వెళ్తే.. కొల్చారం మండలంలోని సీతారాం తండాకు చెందిన గణేష్‌(28) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.  కొన్ని రోజులుగా పని దొరకక అప్పులపాలై తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో  ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య సంధ్యతో పాటు 3 నెలల కుమారుడు, తల్లి ఉన్నారు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  అదేవిధంగా చిన్నశంకరంపేట మండలంలోని మిర్జాపల్లిలో మరో యువకుడు మృతి చెందాడు.  పోలీసులు కథనం ప్రకారం.. మిర్జాపల్లి గ్రామానికి చెందిన కర్రె నర్సింహులు (28) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో  తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. శనివారం ఉదయం ఇంట్లోంచి  బయటకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. భార్య  మౌనిక ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని మెదక్‌   ఆసుపత్రికి తరలించినట్టు ఎస్‌ఐ గౌస్‌ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. 

Updated Date - 2021-06-20T06:03:57+05:30 IST