హడలెత్తించిన నాగుపాము

ABN , First Publish Date - 2021-07-25T07:15:22+05:30 IST

తిరుమలలో శనివారం ఓ నాగుపాము భక్తులను హడలెత్తించింది.

హడలెత్తించిన నాగుపాము
నాగుపామును పట్టుకుంటున్న భాస్కర్‌నాయుడు

తిరుమల, జూలై 24 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో శనివారం ఓ నాగుపాము భక్తులను హడలెత్తించింది. ఎస్వీ మ్యూజియం పక్కనే ఉన్న గుబ్బా సత్రాల్లోకి సుమారు ఐదున్నర అడుగుల పొడవున్న నాగుపాము చొరబడింది. దీన్నిచూసిన భక్తులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వెంటనే పాములు పట్టే భాస్కర్‌నాయుడికి సమాచారమిచ్చారు. ఆయనొచ్చి.. ఆ పామును పట్టుకుని, దట్టమైన అడవిలో వదిలిపెట్టారు. 

Updated Date - 2021-07-25T07:15:22+05:30 IST