మట్టిలోకి మినుము పంట

ABN , First Publish Date - 2021-12-02T05:12:41+05:30 IST

చాగలమర్రి మండలంలోని గొట్లూరులో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న మినుము పంటను రైతులు శ్రీనివాసరెడ్డి, మాబుషరిఫ్‌ బుధ వారం దున్నేశారు.

మట్టిలోకి మినుము పంట
గొట్లూరులో మినుము పంటను దున్నేస్తున్న రైతులు

చాగలమర్రి, డిసెంబరు 1: చాగలమర్రి మండలంలోని గొట్లూరులో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న మినుము పంటను రైతులు శ్రీనివాసరెడ్డి, మాబుషరిఫ్‌ బుధవారం దున్నేశారు. మొత్తం 32 ఎకరాల్లో పంటను తొలగించారు. రూ. 6.60 లక్షలు పెట్టుబడి నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది వర్షాలు తమకు కన్నీరు మిగిల్చాయని అన్నారు. ప్రభుత్వం విత్తనాలు కాకుండా పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.



Updated Date - 2021-12-02T05:12:41+05:30 IST