73 రోజుల విరామం తర్వాత తెలంగాణలో తొలి పరీక్ష

ABN , First Publish Date - 2020-06-03T16:58:01+05:30 IST

లాక్ డౌన్‌తో 73 రోజుల విరామం తర్వాత బుధవారం తెలంగాణలో తొలి పరీక్ష జరుగుతోంది.

73 రోజుల విరామం తర్వాత తెలంగాణలో తొలి పరీక్ష

హైదరాబాద్: లాక్ డౌన్‌తో 73 రోజుల విరామం తర్వాత బుధవారం తెలంగాణలో తొలి పరీక్ష జరుగుతోంది. ఇంటర్ జాగ్రఫీ-2, మోడ్రన్ లాంగ్వేజీ-2 పరీక్షలను అధికారులు నిర్వహిస్తున్నారు. మాస్కులను ధరించిన విద్యార్థులనే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లే ముందు విద్యార్థులకు థర్మాల్ స్క్రీనింగ్ నిర్వహించారు. అన్ని కేంద్రాల్లోనూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. 


తెలంగాణలోని 12 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. గత పరీక్షా కేంద్రాల్లోనే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను గంట ముందు నుంచే అనుమతించారు. 15 నిముషాలు ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. ఈ పరీక్షకు హాజరుకానివారు వచ్చే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చు. రెగ్యులర్ విద్యార్థులగానే పరిగణిస్తామని అధికారులు తెలిపారు. అలాగే పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా పరిస్థితుల మధ్య పరీక్షలను తగిన జాగ్రత్తలతో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - 2020-06-03T16:58:01+05:30 IST