సొమ్ము ఇప్పించడంపైనే తొలి దృష్టి
ABN , First Publish Date - 2022-05-13T09:30:54+05:30 IST
ఆర్థిక నేరాల కేసుల్లో మోసానికి గురైన వారికి డబ్బులు ఇప్పించడంపైనే దర్యాప్తు సంస్థలకు ప్రాథమిక దృష్టి ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఆర్థిక నేరాల కేసులపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
నౌహీర షేక్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, మే 12 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక నేరాల కేసుల్లో మోసానికి గురైన వారికి డబ్బులు ఇప్పించడంపైనే దర్యాప్తు సంస్థలకు ప్రాథమిక దృష్టి ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితులను జైల్లో పెట్టించడంపై కాకుండా బాధితులకు సొమ్ములు అందేలా కృషి చేయాలని సూచించింది. నిందితులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం తర్వాతి దశ కిందికి వస్తుందని పేర్కొంది. జనాల నుంచి డిపాజిట్లు సేకరించి మోసం చేసిన హీరా గోల్డ్ కంపెనీ అధినేత నౌహీరా షేక్కు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీ్స(ఎ్సఎ్ఫఐవో) దాఖలు చేసిన పిటిషన్ను గురువారం న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై స్టే విధించింది. ఎఫ్ఐఆర్ రద్దు చేయడంపై ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకోవాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుకు సూచించింది.