తెలంగాణలో తొలి డోసు 100 శాతం పూర్తి: డీహెచ్
ABN , First Publish Date - 2022-01-04T23:32:41+05:30 IST
రాష్ట్రంలో తొలి డోసు టీకాను 100శాతం వేసినట్లు
హైదరాబాద్: రాష్ట్రంలో తొలి డోసు టీకాను 100 శాతం వేసినట్లు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టుకు డీహెచ్ నివేదికను సమర్పించారు. రెండో డోసు టీకా 69 శాతం పూర్తయిందన్నారు. ఒమైక్రాన్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రం అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఈనెల 1 నాటికి 2.97కోట్ల కరోనా టెస్టులు చేశామని డీహెచ్ పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ సదుపాయం పెరిగిందన్నారు.