వైభవంగా తీజ్ పండుగ
ABN , First Publish Date - 2022-08-14T05:52:50+05:30 IST
వైభవంగా తీజ్ పండుగ
కందుకూరు, ఆగస్టు 13: మండలంలోని మురళీనగర్లో గిరిజన సంప్రదాయాలతో శనివారం తీజ్ పండుగను వైభవంగా జరిపారు. గిరిజన యువతులు వారం రోజులుగా తీజ్ పండుగకు ముస్తాబు చేశారు. మొలకెత్తిన విత్తనాల బుట్టలతో గ్రామంలో భారీ ఊరేగింపుతో తరలించి సాయంత్రం నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు. కృష్ణానాయక్, సర్పంచ్ సోమ్లానాయక్, శ్రీధర్, రమేష్, శంకర్నాయక్ పాల్గొన్నారు.