స్త్రీ పథకం నేటి నుంచి ప్రారంభం
ABN , First Publish Date - 2020-06-06T12:04:08+05:30 IST
స్త్రీ పథకం నేటి నుంచి ప్రారంభం
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): మహిళలకు మరింత భరోసా కల్పిస్తూ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో చేపట్టిన ‘స్త్రీ పథకం’ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. నూతన పథకం సహకారంతో నగర పౌరులను, ప్రజలను పోలీసులతో మమేకం చేసి ప్రత్యేక గ్రూపులుగా ఏర్పాటు చేస్తారు. బాధిత మహిళలు, యువతులు, బాలికలకు వీడియో కౌన్సెలింగ్ లేదా టెలీ కౌన్సెలింగ్ నిర్వహించే ఏర్పాట్లు చేసి ఎక్కడ సమస్య ఉన్నా పరిష్కరించేలా ఏర్పాట్లు చేయనున్నారు.