ఆ చట్టాలను మళ్లీ చేయమని రైతులే అడుగుతారు

ABN , First Publish Date - 2021-12-03T08:45:33+05:30 IST

ఇప్పుడు ఉపసంహరించుకున్న వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలని రైతులే అభ్యర్థించే రోజు వస్తుందని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై అన్నారు.

ఆ చట్టాలను మళ్లీ చేయమని రైతులే అడుగుతారు

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై

కోయంబత్తూరు, డిసెంబరు 2: ఇప్పుడు ఉపసంహరించుకున్న వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలని రైతులే అభ్యర్థించే రోజు వస్తుందని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై అన్నారు. ఇక్కడకు సమీపంలోని అన్నూర్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల ప్రయోజనం కోసమే కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను చేసిందని చెప్పారు. అయితే తమిళనాడులోని డీఎంకేతో సహా ప్రతిపక్షపార్టీలు స్వార్థప్రయోజనాల కోసం నాటకాలాడి  ప్రభుత్వానికి, చట్టాలకు వ్యతిరేకంగా చేసిన అల్లర్లను  తిప్పికొట్టవలసి వచ్చిందన్నారు. అందుకే ప్రధాని మోదీ ఆ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-12-03T08:45:33+05:30 IST