రైతు భరోసా కేంద్రాలను వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2020-06-01T10:45:26+05:30 IST

సాగు రైతులు రైతు భరోసా కేంద్రాలను వినియోగిం చుకోవాలని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట

రైతు భరోసా కేంద్రాలను వినియోగించుకోవాలి

రామభద్రపురం, మే 31: సాగు రైతులు రైతు భరోసా కేంద్రాలను వినియోగిం చుకోవాలని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు.   పాతరేగలో ఆదివారం ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయన  గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు.  ఈ సందర్భంగా గ్రామస్థులు పాతరేగ, కొత్తరేగ గ్రామాల మధ్య కాజ్‌వే నిర్మాణం చేపట్టాలని కోరారు. త్వరలో నిధులు తెప్పించి నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అర్హులందరూ పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పాతరేగలో డ్రైనేజీ, కాలువల నిర్మాణం చేపడతామన్నారు. గ్రామంలో ఉన్న కోనేరును  అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల బూత్‌ కమిటీ అధ్యక్షుడు పత్తిగల ఏక్‌నాథ్‌, మాజీ సర్పంచ్‌లు గొర్లె శ్రీనివాసరావు, మరడరామునాయుడు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు కిర్ల చంద్రశేఖర్‌, పెద్దింటి తిరుపతిరావు, సన్యాసిరావు, ఔగడ్డి బలరాం నాయుడు, మాజీ ఎంపీటీసీ పైడిపినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-01T10:45:26+05:30 IST