రైతు వేదిక నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2020-07-01T11:48:52+05:30 IST
రైతు వేదిక భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి, త్వరగా రైతులకు అందుబాటులోకి
పలు గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్
కంది/సదాశివపేటరూరల్/సంగారెడ్డిరూరల్/కొండాపూర్, జూన్ 30 : రైతు వేదిక భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి, త్వరగా రైతులకు అందుబాటులోకి తీసుకురాలని జిల్లా కలెక్టర్ ఎం.హన్మంతరావు అన్నారు. మంగళవారం కంది మండలంలోని చిద్రుప్ప, కందిలో, సదాశివపేట మండలంలోని పెద్దాపూర్లో, సంగారెడ్డి పట్టణ శివారులోని పోతిరెడ్డిపల్లిలో, కొండాపూర్ మండలంలోని మల్కాపూర్, కొండాపూర్, అనంతసాగర్, మాందాపూర్లో, హత్నూర మండలంలోని కాసాల గ్రామ శివారులో రైతు వేదిక నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. కందిలో రైతు వేదిక నిర్మాణ స్థలం వద్ద మొక్కను నాటారు. రైతు వేదిక భవనాల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హన్మంతరావు అధికారులు, కాంట్రాక్టర్లను హెచ్చరించారు.