ప్రమాదవశాత్తు కాల్వలో పడి రైతు మృతి
ABN , First Publish Date - 2020-07-31T16:53:02+05:30 IST
మరిపెడ మండలం బురాన్పురంలో విషాదం నెలకొంది.
మహబూబాబాద్ జిల్లా: మరిపెడ మండలం బురాన్పురంలో విషాదం నెలకొంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎస్ఆర్ఎస్పీ డీబీఎం-36 కాలువకు గండి పడింది. దీనిని అధికారులు పట్టించుకోకపోవడంతో.. గుగ్గిళ్ల ముత్తయ్య అనే రైతు గండి పూట్చడానికి వెళ్లాడు. అయితే ప్రమాదవ శాత్తు కాల్వలో పడి రైతు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.