భర్త అంత్యక్రియలు పూర్తయిన కొద్ది గంటలకే మరో షాకింగ్ న్యూస్.. అర్ధరాత్రి బాత్రూంకని వెళ్లిన ఆ భార్య..

ABN , First Publish Date - 2021-07-17T17:54:16+05:30 IST

కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి గురువారం మరణించాడు..

భర్త అంత్యక్రియలు పూర్తయిన కొద్ది గంటలకే మరో షాకింగ్ న్యూస్.. అర్ధరాత్రి బాత్రూంకని వెళ్లిన ఆ భార్య..

కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి గురువారం మరణించాడు.. అతని అంత్యక్రియలు పూర్తి చేసి తిరిగొచ్చిన వారికి మరో షాకింగ్ విషయం తెలిసింది.. ఆ వ్యక్తి భార్య కూడా మరణించింది.. బావిలో పడిపోవడం వల్ల ఆమె ప్రాణం పోయింది. ఝార్ఖండ్‌లోని గోమియా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. 


గోమియాకు చెందిన లాలా ఖండూ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడికి అంత్యక్రియలు నిర్వహించారు. అదే రోజు రాత్రి అతని భార్య అనురాధా దేవి బావిలో పడి చనిపోయింది. దీంతో ఒకేరోజు ఆ ఇంట్లో రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. అయితే అనురాధ ఎందుకు చనిపోయిందనే విషయంలో స్పష్టత లేదు. అనురాధ తరచుగా మూర్ఛ రోగంతో బాధపడుతుంటుందని, గురువారం రాత్రి బాత్రూంకు వెళ్దామని లేచి బావి నుంచి నీళ్లు తోడుతుండగా ఆమెకు ఫిట్స్ వచ్చి ఉంటుందని, దీంతో ఆమె బావిలో పడిపోయి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు సాగిస్తున్నారు. 

Updated Date - 2021-07-17T17:54:16+05:30 IST