కేసీఆర్ పతనానికి.. ‘హుజూరాబాదే’ నాంది..: ఈటల

ABN , First Publish Date - 2021-09-11T21:27:17+05:30 IST

సంగారెడ్డి: సీఎం కేసీఆర్ పతనానికి హుజూరాబాద్ ఉప ఎన్నికే.. నాంది అని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. జిల్లాలోని జోగిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో శనివారం ప్రజా సంగ్రామయాత్ర బహిరంగ

కేసీఆర్ పతనానికి.. ‘హుజూరాబాదే’ నాంది..: ఈటల

సంగారెడ్డి: సీఎం కేసీఆర్ పతనానికి హుజూరాబాద్ ఉప ఎన్నికే.. నాంది అని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. జిల్లాలోని జోగిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో శనివారం ప్రజా సంగ్రామయాత్ర బహిరంగ సభ నిర్వహించారు. బాబూమోహన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ నోట్ల కట్టలు, మందు సీసాలు తమ గెలుపును ఆపలేవన్నారు.


యుద్ధం మొదలైందని చెప్పారు. ప్రగతి భవన్‌లో కూర్చుని తన గొంతు పిసికేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తన సహచరుడు హరీష్ రావు.. ఆ కుట్రలను అమలు చేస్తున్నారని తెలిపారు. దమ్ముంటే కేసీఆర్, హరీష్‌రావులే తన మీద పోటీకి రావాలని సవాల్ విసిరారు. ఒకవేళ తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు. కేంద్రంపై ఇక్కడ విమర్శలు చేస్తున్న కేసీఆర్.. ఢిల్లీలో వంగి వంగి దండాలు పెడుతున్నారని ఈటల ఎద్దేవా చేశారు.

Updated Date - 2021-09-11T21:27:17+05:30 IST