చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా
ABN , First Publish Date - 2020-07-07T10:17:59+05:30 IST
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా విస్తరిస్తోంది. సోమవారం షాద్నగర్లో ఐదు, కొత్తూర్ మండలంలో నాలుగు, శంషాబాద్ మునిపాలిటీలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి
షాద్నగర్/కొత్తూర్/చౌదరిగూడ/శంషాబాద్/కొడంగల్/వికారాబాద్/ పరిగి/ఆదిభట్ల: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా విస్తరిస్తోంది. సోమవారం షాద్నగర్లో ఐదు, కొత్తూర్ మండలంలో నాలుగు, శంషాబాద్ మునిపాలిటీలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. చౌదరిగూడ మండలం పెద్దఎల్కిచర్లకు చెందిన 30ఏళ్ల యువకుడికి, కొడంగల్లో స్థానిక రిటైర్డ్ ప్రభుత్వ అధికారికి కరోనా సోకింది. వికారాబాద్ జిల్లాలో మరో 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వికారాబాద్ పట్టణంలో మూడు, బీటీఎస్ కాలనీల్లో ఒక్కో కేసు నమోదు కాగా మునిసిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఉద్యోగి కరోనా బారిన పడ్డారు. మంగళవారం ఆ కార్యాలయానికి సెలవు ప్రకటించారు. పరిగిలో ఓ యువకుడికి కరోనా పాజిటివ్గా తేలింది. ఆదిభట్ల పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది