ఒకటో తేదీ లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి
ABN , First Publish Date - 2021-02-28T04:27:06+05:30 IST
పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మార్చి ఒకటో తేదీ లోగా చెల్లించాలని జి ల్లా విద్యాశాఖ అధికారి ఎన్వీ.దుర్గాప్రసాద్ తెలిపారు.
నిజామాబాద్అర్బన్, ఫిబ్రవరి 27: పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మార్చి ఒకటో తేదీ లోగా చెల్లించాలని జి ల్లా విద్యాశాఖ అధికారి ఎన్వీ.దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీ జు వివరాలను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను అడిగి చెల్లించాలని తెలిపారు. విద్యార్థులను పరీక్షలను సిద్ధం చేయాలని తెలిపారు. అన్ని పాఠశాల హెచ్ఎంలు ఎప్పటికప్పుడు పరీక్ష ఫీజుకు సంబంఽధించిన వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.