‘కస్తూరి రత్నం’ ట్రస్టు ఏర్పాటు అభినందనీయం
ABN , First Publish Date - 2021-04-16T07:15:44+05:30 IST
కస్తూరి రత్నం చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేయడం అభినందనీయమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు
తిరుపతి(కొర్లగుంట), ఏప్రిల్ 15: కస్తూరి రత్నం చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేయడం అభినందనీయమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. తిరుపతిలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ట్రస్టుకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరసారత్నం మాట్లాడుతూ.. తన భార్య కస్తూరి రత్నం జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ ట్రస్టు ద్వారా బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సేవలందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు.