ఫార్మాసిటీ ఏర్పాటును రద్దు చేయాలి
ABN , First Publish Date - 2021-07-27T04:50:46+05:30 IST
ఫార్మాసిటీ ఏర్పాటును రద్దు చేయాలి
యాచారం/ఆదిభట్ల: యాచారం-కందుకూరు మండలాల మధ్యన ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీని రద్దు చేయాలని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఫార్మాసిటీ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని కోరుతూ వైస్ ఎంపీపీ కె.శ్రీనివా్సరెడ్డి, నాయకులు కె.అరవింద్నాయక్, ఎం..వెంకట్రెడ్డి తదితరులు సోమవారం ఆదిభట్లలో ఎంపీని కలిసి వినతిపత్రమందజేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న బొంగ్లూరు-ఆదిభట్ల రోడ్డును భువనగిరి ఎంపీ వెంకట్రెడ్డి సోమవారం పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జడ్పీటీసీ మహిపాల్, కాంగ్రెస్ నాయకులు మర్రి నిరంజన్రెడ్డి, శేఖర్గౌడ్, తదితరులున్నారు.