నిత్యావసరాల సవరణ బిల్లు సరికాదు
ABN , First Publish Date - 2020-09-17T08:37:02+05:30 IST
నిత్యావసర సరుకుల సవరణ బిల్లు-2020ను ఉపసంహరించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ..
- రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు
హైదరాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నిత్యావసర సరుకుల సవరణ బిల్లు-2020ను ఉపసంహరించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ.. బడా కార్పొరేట్లకు ధారాదత్తం చేేసందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం సుందరయ్య పార్క్ వద్ద కార్మిక సంఘాల ప్రతినిధులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ... కేంద్రం రూపొందించిన వ్యవసాయ బిల్లుల వల్ల రైతులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలను కారు చవకగా కొనుగోలు చేస్తూ బడా వ్యాపారులు గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తారన్నారు. పెద్ద కంపెనీలు వ్యవసాయ రంగంలోకి అడుగుపెడితే చిన్న, సన్నకారు రైతులు తమ పొలాల్లో తామే కూలీలుగా మారిపోతారని చెప్పారు. సంస్కరణల వల్ల ఇప్పటి వరకున్న రాయితీలు కనుమరుగవుతాయన్నారు.