దుర్బుద్ధితోనే కొత్త పార్టీల ఆవిర్భావం

ABN , First Publish Date - 2021-04-11T06:43:44+05:30 IST

దుర్బుద్ధితోనే తెలంగాణలో కొత్త పార్టీలు ఆవిర్భవిస్తున్నాయని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

దుర్బుద్ధితోనే కొత్త పార్టీల ఆవిర్భావం
గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండ, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దుర్బుద్ధితోనే తెలంగాణలో కొత్త పార్టీలు ఆవిర్భవిస్తున్నాయని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పార్టీల ఏర్పాటు యోచనతో పాటు తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరి హయాంలో మొబిలైజేషన్‌ పేరిట కమీషన్‌ తీసుకున్నారో, ఎవరి హయాంలో వేట కొడవళ్లు, కత్తులు, బాంబుల సంస్కృతి ఉన్నదో, ఎవరి హయాంలో హైదరాబాద్‌లో అరాచకాలు మతకల్లోలాలు నెలకొన్నాయో అందరికీ తెలుసన్నారు. ఇలాంటి వ్యక్తులు నీతులు వల్లించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. పోతిరెడ్డిపాడు సంగమేశ్వరం ద్వారా నీళ్ల దోపిడీ చేశారని విమర్శించారు.  

Updated Date - 2021-04-11T06:43:44+05:30 IST