ట్రాక్టర్కు విద్యుత్ తీగలు తగిలి గడ్డి దగ్ధం
ABN , First Publish Date - 2021-04-17T06:49:05+05:30 IST
గడ్డిలోడుతో వెళుతున్న ట్రాక్టర్కు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి రూ.40 వేల విలువైన గడ్డి దగ్ధమైంది.
డ్రైవర్కు తీవ్రగాయాలు
రూ.40 వేల ఆస్తి నష్టం
మఠంపల్లి, ఏప్రిల్ 16: గడ్డిలోడుతో వెళుతున్న ట్రాక్టర్కు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి రూ.40 వేల విలువైన గడ్డి దగ్ధమైంది. ఈ ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని భోజ్యతండాకు చెందిన సౌదసోతు హనుమంతు గడ్డిలోడుతో శుక్రవారం మఠంపల్లి వైపు వెళ్తుండగా రఘునాథపాలెం గ్రామసెంటరులో విద్యుత్ తీగలు తగిలి మంటలు అంటుకున్నాయి. ట్రాక్టర్ నుంచి గడ్డిని తొలగించే ప్రయత్నంలో డ్రైవర్ హనుమంతుకు మంటలు అంటుకుని తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు నీళ్లు పోసి మంటలను ఆర్పారు. హను మంతును చికిత్స నిమిత్తం 108 అంబులెన్సులో హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అ