మున్సిపల్‌ రెండో వైస్‌చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం

ABN , First Publish Date - 2021-07-31T06:14:11+05:30 IST

మున్సిపల్‌ రెండో వైస్‌చైర్మ నగా 9వ వార్డు కౌన్సిలర్‌ మాసపల్లి సాయికుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మున్సిపల్‌ రెండో వైస్‌చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం
ధర్మవరంలో డిక్లరేషన ఫామ్‌ను అందుకుంటున్న సాయికుమార్‌

ధర్మవరం, జూలై 30: మున్సిపల్‌ రెండో వైస్‌చైర్మ నగా 9వ వార్డు కౌన్సిలర్‌ మాసపల్లి సాయికుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక మున్సిపల్‌ కా ర్యాలయంలో శుక్రవారం కౌన్సిల్‌ హాల్లో రెండో వైస్‌చైర్మన ఎంపిక కార్యక్రమాన్ని ప్రిసైడింగ్‌ అధికారి, మున్సిపల్‌ ఆర్‌డీ నాగరాజు నిర్వహిం చారు.  ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హాజరై  మా సపల్లి సాయికుమార్‌ పేరును ప్రకటిం చారు. సాయికుమార్‌ పేరును 24వ వార్డు కౌన్సిలర్‌ పురుషోత్తంరెడ్డి, 3వ వార్డు కౌన్సిలర్‌ శంకర తేజేశ్వర్‌లు ప్రతిపాదించారు. ఎవరూ పోటీలో లేక పో వడంతో  ప్రిసైడింగ్‌ అధికారి నాగరాజు రెండో వైస్‌చైర్మనగా సాయికుమార్‌ను డిక్లేర్‌ చేశారు. అనంతరం అతనితో ప్రమాణ స్వీకారం చేయించారు. అతడికి ఎమ్మెల్యే, ప్రిసైడింగ్‌ అధికారి, కమిషనర్‌ మల్లికార్జునలు డిక్లరేషన ఫామ్‌ను అందజే శారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ముఖ్య మంత్రి వైస్‌జగన్మో హనరెడ్డి మొట్టమొదటి సరిగా మున్సిపాలిటీల్లో రెండో వైస్‌చైర్మ నను  తీసుకువచ్చి పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యం ఇచ్చేం దుకు ఈ ప దవులు ఇస్తున్నారన్నారు.  అనంతరం సాయికుమార్‌ ఎమ్మెల్యేని సత్కరించి కృ తజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్య క్రమంలో చైర్‌పర్సన లింగంనిర్మల, వైస్‌చైర్మన చందమూరి నారాయణరెడ్డి, కౌన్సిలర్‌లు షంషా ద్‌బేగం, రాయపా టి మంజుల, అత్తర్‌జిలాన, శంకరతే జేశ్వర్‌, కడప రంగస్వా మి, మేడాపురం వెంకటేశ, కోటిరెడ్డిసుజాత, బ్రహ్మయ్య, చింతాయల్లయ్య, జేసీబీ రమణ, రమాదేవి, కో ఆప్షనమెంబర్లు రామక్రిష్ణ, కరీం తదిరులు పాల్గొన్నారు.

పుట్టపర్తి: నగరపంచాయతీ రెండవ వైస్‌చైర్మనగా 1వ వార్డుకౌన్సిలర్‌ మాతంగి తిప్పన్న ఏకగ్రీవంగా ఎంపిక య్యారు. శుక్రవారం నగర పంచాయతీ కార్యాలయంలో చైర్మన ఓబుళపతి అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేవం నిర్వహిం చారు. ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ నీలమయ్య ఎంపికను చేపట్టారు. కౌన్సిలర్‌ భాస్కర్‌ రెడ్డి తిప్పన్న అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా కౌన్సిలర్‌ సూర్యాగౌడ్‌ బలపరి చారు. ఒకే వ్యక్తి పోటీలోనిలబడటంతో ఎంపిక ఏకగ్రీవంకాగా ఆయన చేత ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. సమావేశంలో ఇనచార్జ్‌ కమిషనర్‌ మురళీ, వైస్‌చైర్మన శ్రీలక్ష్మీ, సభ్యులు బీడిపల్లిలక్ష్మీదేవి, లక్ష్మీపతి, పలువురు పాల్గొన్నారు.

  కదిరి: కదిరి మున్సిపాలిటీలో 2వ వైస్‌ చైర్మనగా 32 వార్డు కౌన్సిలర్‌ అజ్జుకుంటి రాజశేఖర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం స్థానిక కౌన్సిల్‌హాల్‌లో కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి ఎక్స్‌ అఫీసీయో మెంబర్‌గా కదిరి ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి హాజరయ్యారు. ఈసమావేశంలో 2వ వైస్‌చైర్మన కోసం ఎన్నికల అధికారి, అర్‌డీఓ వెంకటరెడ్డి ఎన్నికలు నిర్వహించారు. సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమయింది. సమావేశంలో మొదట సమా వేశానికి హాజ రైన కౌన్సిలర్‌లతో సంతకాలుచేయించారు. అనంతరం వైస్‌ చైర్మన కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే  వైసీపీ తన అభ్యర్థిగా 32 వార్డు కౌన్సిలర్‌ అజ్జుకుంటి రాజశేఖర్‌రెడ్డి పేరుతో ఉన్న బీ ఫారాన్ని ఎన్నికల అధికారికి అం దజేశారు. పేరును ప్రకటించగానే 7వవార్డు కౌన్సిలర్‌ కిన్నెర కళ్యాణ్‌ వైస్‌ చైర్మన అభ్యర్థిగా అజ్జుకుంటి రాజశేఖర్‌రెడ్డి ప్రతిపాదించారు. 29 వార్డు కౌన్సిలర్‌ సయ్యద్‌ కతిబ్‌ షబ్బీర్‌ బలపరచారు. ఎవరు పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా రాజశేఖర్‌రెడ్డి 2వ వైస్‌ చైర్మనగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయనతో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈసమావేశంలో చైర్‌పర్సన నజీమున్నిసాతో పాటు, వైస్‌ చైర్‌పర్సన కొమ్ము గంగాదేవి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T06:14:11+05:30 IST