మద్యం మత్తులో తమ్ముడిని చంపిన అన్న

ABN , First Publish Date - 2022-01-01T22:41:18+05:30 IST

మద్యం మత్తులో తమ్ముడిని అన్న చంపేసిన సంఘటన

మద్యం మత్తులో తమ్ముడిని చంపిన అన్న

వికారాబాద్: మద్యం మత్తులో తమ్ముడిని అన్న చంపేసిన సంఘటన జిల్లాలో జరిగింది. ఆలంపల్లిలో ఈ దారుణం  చోటు చేసుకుంది. సొంత అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. అంజిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి అనే అన్నదమ్ములు ఆలంపల్లిలో నివాసం ఉంటున్నారు. కొత్త సంవత్సరం వేడుకలు ముగించుకొని తమ్ముడు గోవర్ధన్ రెడ్డి ఇంటికి వచ్చాడు. అనంతరం అన్నదమ్ముల మధ్య గొడవ ప్రారంభమైంది. ఆవేశంలో స్ర్కూ డ్రైవర్‌తో తమ్ముడిని పొడిచి అన్న అంజిరెడ్డి చంపాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ చెప్పారు. 

Updated Date - 2022-01-01T22:41:18+05:30 IST