దూదేకుల వారు ఇస్లాం మతానికి చెందిన తెలుగు మాట్లాడే ముస్లింలు: మన్నూరు అక్బర్‌

ABN , First Publish Date - 2022-07-04T05:22:36+05:30 IST

దూదేకుల వారు ఇస్లాం మతానికి చెందిన తెలుగు మాట్లాడే ముస్లిములు అని, వీరు ఆచార వ్యవహారాలు ఖురాన, ముహమ్మద్‌ ప్రవక్త చెప్పిన నిఖా, ఒడుగులు, దఫ్నా చేసుకుంటారని, అయితే ఎమ్మెల్యే రాచుమల్లు చెప్పి న ముస్లింలు 200 దేశాలలో చేస్తారని టీడీపీ జిల్లా అఽధికార ప్రతినిధి, దూదేకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మన్నూర్‌ అక్బర్‌ తెలిపారు.

దూదేకుల వారు ఇస్లాం మతానికి చెందిన   తెలుగు మాట్లాడే ముస్లింలు: మన్నూరు అక్బర్‌

కడప(ఎర్రముక్కపల్లి), జూలై 3 : దూదేకుల వారు ఇస్లాం మతానికి చెందిన తెలుగు మాట్లాడే ముస్లిములు అని, వీరు ఆచార వ్యవహారాలు ఖురాన్, ముహమ్మద్‌ ప్రవక్త చెప్పిన నిఖా, ఒడుగులు, దఫ్నా చేసుకుంటారని, అయితే ఎమ్మెల్యే రాచుమల్లు చెప్పిన ముస్లింలు 200 దేశాలలో చేస్తారని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి, దూదేకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మన్నూర్‌ అక్బర్‌ తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హజరత్ అలీని దూదేకుల వారు కొలుస్తారని... ఎమ్మెల్యే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. దూదేకుల వారు ఉన్న పాఠశాలలో మస్జీదులు ఉన్నాయని ఆ ప్రాంతాలలో అల్లాహ్‌ గురించి తెలుగులో బయ్యాన్ జరుగుతుందన్నారు. తెలుగు ఖురాన్‌లు ఉన్నాయని స్పస్టం చేశారు. దూదేకుల వారు హైందవులు అని చెప్పి దూదేకుల వారి మనోభావాలు గాయపరిచారన్నారు. ఆదే విధంగా భారత దూదేకుల పౌరునిగా ప్రేమపూర్వకంగా ఆహ్మానిస్తున్నానంటూ... మీరు ఇస్లాం మతం స్వీకరిస్తే మీరు మాట్లాడిన మాటలు ముస్లిం సమాజం నమ్ముతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నగర అధ్యక్షుడు మళ్లీ, దూదేకులనాయకులు హుస్సేన్, ఖాదరయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T05:22:36+05:30 IST