బాదుడు ప్రభుత్వాన్ని గద్దెదించాలి

ABN , First Publish Date - 2022-05-19T06:54:12+05:30 IST

రాష్ట్రంలో అన్నింటిపై ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్న ప్రభుత్వాన్ని గద్దెదించాలని మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేం ద్రగౌడు పిలుపునిచ్చారు

బాదుడు ప్రభుత్వాన్ని గద్దెదించాలి

-మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు

గుంతకల్లుటౌన్‌, మే 18: రాష్ట్రంలో అన్నింటిపై ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్న ప్రభుత్వాన్ని గద్దెదించాలని మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేం ద్రగౌడు పిలుపునిచ్చారు. పట్టణంలోని 5, 6 వార్డుల్లో బుధవారం సాయంత్రం బీసీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు టీ కేశప్ప, మాజీ కౌన్సిలరు సుశీల మ్మ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత వాల్మీకి విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ పోవాలంటే బాబుకు ఓటేయాలన్నారు. ఇంటిం టికి వెళ్లి కొవ్వొత్తులను, అగ్గిపెట్టెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు కార్యదర్శి ఆమ్లెట్‌ మస్తాన్‌ యాదవ్‌, కార్యనిర్వాహక కార్యదర్శి గుమ్మనూరు వెంకటేశులు, వాణిజ్య సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతు, మాజీ ఎంపీటీసీ తలారి మస్తానప్ప, నాయకులు రామన్న చౌదరి, ప్రతాప్‌ నాయుడు, బీ రాము, వీ రాముడు, నందీశ్వర, శివన్న, ఫ్రూట్‌ మస్తాన్‌, ఫజులు, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-19T06:54:12+05:30 IST