మంటకలిసిన మానవత్వం
ABN , First Publish Date - 2021-05-18T05:22:08+05:30 IST
కరోనాతో బాధపడుతున్న వ్యక్తికి మెరుగైన చికిత్స కోసం కడపకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెండటంతో మృతదేహాన్ని నిర్ధాక్షిణ్యంగా అడవిలో దించివేసిన సంఘటన సోమవారం అట్లూరులో సమీపంలో జరిగింది.
కరోనాతో చనిపోయిన వ్యక్తిని అడవిలో దించేసిన వాహన డ్రైవర్
అట్లూరు, మే 17: కరోనాతో బాధపడుతున్న వ్యక్తికి మెరుగైన చికిత్స కోసం కడపకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెండటంతో మృతదేహాన్ని నిర్ధాక్షిణ్యంగా అడవిలో దించివేసిన సంఘటన సోమవారం అట్లూరులో సమీపంలో జరిగింది. బద్వేలు సురేంద్ర నగర్కు చెందిన చిన్న జోగేశ్వర్ (55) అనే వ్యక్తికి కరోనా పాజిజివ్ వచ్చింది. దీంతో అతడికి మెరుగైన చికిత్స కోసం ఆయన భార్య ఓ ప్రైవేట్ వాహనాన్ని బాడుగకు తీసుకుని కడపకు బయలుదేరింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి అట్లూరు సమీపంలో గల అటవీశాఖ చెక్పోస్టు దాటుకుని కొంత దూరం వెళ్లగానే చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఆ వాహన డ్రైవర్ మానవత్వం మరిచి నిర్ధాక్షిణ్యంగా ఆ శవాన్ని అడవిలో రోడ్డుపక్కన దించేసి వెళ్లాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ శ్రీకాంత 108 వాహనం ద్వారా మృతదేహాన్ని బద్వేలుకు తరలించారు.