మోరీలను శుభ్రం చేయాలి

ABN , First Publish Date - 2021-12-04T07:17:38+05:30 IST

భువనగిరి లోని బోయవాడలో మోరీలను శుభ్రం చేయా లని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కోరారు.

మోరీలను శుభ్రం చేయాలి
మోరీ వద్ద ముక్కు మూసుకుని నిరసన తెలుపుతున్న విద్యార్థులు

భువనగిరి టౌన్‌, డిసెంబరు 3: భువనగిరి లోని బోయవాడలో మోరీలను శుభ్రం చేయా లని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కోరారు. వార్డులో మునిసిపల్‌ కమి షనర్‌ ఎం.పూర్ణచందర్‌ శుక్రవారం పర్యటన నేపథ్యంలో విద్యార్థులు మురుగు కాల్వ వద్ద ముక్కు మూసుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడు తూ కాల్వలో మురుగు నీరు నిల్వ ఉంటున్నం దున దుర్వాసనతో మధ్యాహ్న భోజనం కూడా చేయలేకపోతున్నామన్నారు. దోమల ఉధృతి పెరిగిందన్నారు. విద్యార్థుల నిరసన తెలు సు కుని కమిషనర్‌తో పాటు  కౌన్సిలర్‌ రేణుక  పాఠశాల  వద్దకు వచ్చి మురుగు కాల్వ సమ స్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వ డంతో విద్యార్థులు నిరసనను విరమించారు


Updated Date - 2021-12-04T07:17:38+05:30 IST