యువతి అదృశ్యం
ABN , First Publish Date - 2022-07-04T05:48:00+05:30 IST
యువతి అదృశ్యం
శంషాబాద్ రూరల్, జూలై 3: యువతి అదృశ్యమైన ఘటన ఆదివారం శంషాబాద్ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పాల్మాకుల గ్రామానికి చెందిన అశోక్, భాగ్యలక్ష్మి కూతురు పూజ(20) ఆదివారం తెల్లవారుజామున 4.30గంటలకు ఇంటి నుంచి బయలుదేరి వెళ్లింది. తల్లిదండ్రులు ఉదయం లేచిచూడగా పూజ కనబడలేదు. ఇంటి చూట్టుపక్కల, బంధువుల వద్ద, స్నేహితుల వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వారు ఆదివారం శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.