యువకుడి అదృశ్యం
ABN , First Publish Date - 2022-05-11T06:49:55+05:30 IST
కోస్లీ పంచాయతీ పరిధిలోని ఫకీరాబాద్కు చెందిన మహబూబ్ఖాన్ (29) అనే యువకుడు ఈనెల 3న అదృశ్యమయ్యాడని ఎస్సై రాజారెడ్డి తెలిపారు. రంజాన్ పండుగ రోజున బయటకు వెళ్లిన అతడు తిరిగి ఇంటికి చేరుకోలేదని, బంధువుల ఇండ్లలో వెతికినా ఆచూకి లభించలేదని ఆయన పేర్కొన్నారు. తండ్రి జానిఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నవీపేట: కోస్లీ పంచాయతీ పరిధిలోని ఫకీరాబాద్కు చెందిన మహబూబ్ఖాన్ (29) అనే యువకుడు ఈనెల 3న అదృశ్యమయ్యాడని ఎస్సై రాజారెడ్డి తెలిపారు. రంజాన్ పండుగ రోజున బయటకు వెళ్లిన అతడు తిరిగి ఇంటికి చేరుకోలేదని, బంధువుల ఇండ్లలో వెతికినా ఆచూకి లభించలేదని ఆయన పేర్కొన్నారు. తండ్రి జానిఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
యువతి అదృశ్యం
మహంతంకు చెందిన సుంకరి హర్షిత (19) అనే యువతి అదృశ్యమైందని ఎస్సై రాజారెడ్డి తెలిపారు. ఈనెల 9న బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదని ఆయన పేర్కొన్నారు. బంధువుల ఇండ్లలో వెతికినా ఆచూకి లభించలేదని సోదరుడు సుంకరి బంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.