అయిజ పట్టణ, మండల అధ్యక్షుల ఎంపిక

ABN , First Publish Date - 2021-10-19T05:28:54+05:30 IST

టీఆర్‌ఎస్‌ అయిజ మండల, పట్టణ అధ్యక్షులను ఎట్టకేలకు ఎంపిక చేశారు.

అయిజ పట్టణ, మండల అధ్యక్షుల ఎంపిక
మండల, పట్టణ నూతన అధ్యక్షులతో ఎమ్మెల్యే అబ్రహాం

- ఎమ్మెల్యే ప్రకటనతో తొలగిన సందిగ్ధం

అయిజ, అక్టోబర్‌ 18 : టీఆర్‌ఎస్‌ అయిజ మండల, పట్టణ అధ్యక్షులను ఎట్టకేలకు ఎంపిక చేశారు. అయిజలో ఇరువర్గాల మధ్య కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో మండల, పట్టణ అధ్యక్షులను ఎంపిక చేయలేదు. నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షుల పేర్లను ప్రకటించినప్పటికీ, అయిజ పట్టణ, మండల అధ్యక్షుల పేర్లను మాత్రం ఎమ్మెల్యే అబ్రహం ప్రకటించకుండా సందిగ్ధంలో ఉంచారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో కేటీఆర్‌ సమక్షంలో ఎమ్మెల్యే అబ్రహాం వారి పేర్లను ప్రకటించారు. మండల అధ్యక్షుడిగా తూముకుంట రఘునాథ్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడిగా మహబూబ్‌పాషా పేర్లను ప్రకటించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో అధ్యక్షుడు రాముడు పాల్గొన్నారు. అధ్యక్షుల పేర్ల ప్రకటనతో వారి అనుచరులు, అభిమానులు పట్టణంలో బాణసంచా కాల్చి, స్వీట్లు తినిపించుకుని సంబురాలు చేసుకున్నారు. 

Updated Date - 2021-10-19T05:28:54+05:30 IST