అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ABN , First Publish Date - 2022-05-17T03:58:20+05:30 IST
అన్ని వర్గాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. సోమవారం మండలంలోని వీరాపూర్, పోలంపల్లి గ్రామాల్లో రూ.1.30 కోట్లతో చేపట్టే బీటీ రోడ్లకు శంకుస్ధాపన చేశారు. అనంత రం కన్నెపల్లి రైతు వేదికలో 25 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
కన్నెపల్లి, మే 16 : అన్ని వర్గాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. సోమవారం మండలంలోని వీరాపూర్, పోలంపల్లి గ్రామాల్లో రూ.1.30 కోట్లతో చేపట్టే బీటీ రోడ్లకు శంకుస్ధాపన చేశారు. అనంత రం కన్నెపల్లి రైతు వేదికలో 25 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకోలేదన్నారు. కల్యా ణలక్ష్మి పథకం నిరుపేద యువతులకు వరంలాంటిదన్నారు. అనంతరం ముత్తాపూర్, మెట్పల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోం దన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, జడ్పీటీసీ కౌటారపు సత్య నారాయణ, వైస్ ఎంపీపీ రాకేశ్ శర్మ, సర్పంచులు జిల్లెల్ల అశోక్గౌడ్, పనాస అం జన్న, సీపెల్లి లక్ష్మీ, కర్పెత లక్ష్మీ, తిరుపతి, తహసీల్దార్ రాంచందర్, ఎంపీటీసీలు భారతి, లతశ్రీ, నియోజకవర్గ అధ్యక్షుడు జిల్లెల మహేశ్గౌడ్, కన్నెపల్లి, భీమిని మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు సాయిని రంగారావు, నిరంజన్ గుప్తా, పీఏసీ ఎస్ వైస్ చైర్మన్ ఆకుతోట రాజన్న, నాయకులు నర్సింగరావు పాల్గొన్నారు.