పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ

ABN , First Publish Date - 2021-12-01T05:40:56+05:30 IST

మండలంలోని పాల్తూరు గ్రామంలోని ఇందిరానగర్‌ ఎంపీ యూపీ పాఠశాలను డీ ఈఓ శామ్యూల్‌ మంగళవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు

పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న డీఈఓ

విడపనకల్లు, నవంబరు 30: మండలంలోని పాల్తూరు గ్రామంలోని ఇందిరానగర్‌ ఎంపీ యూపీ పాఠశాలను డీ ఈఓ  శామ్యూల్‌ మంగళవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఏజెన్సీ నిర్వాహకులు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందివ్వాలన్నారు. విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. 


Updated Date - 2021-12-01T05:40:56+05:30 IST