కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి
ABN , First Publish Date - 2021-06-11T06:07:41+05:30 IST
జిల్లా కేంద్రంలో రిమ్స్లో అన్ని విభాగాల్లో పని చేస్తున్న కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గురువారం రిమ్స్ ఓపీ బ్లాక్ ఎదుట సీఐటీయూ నాయకులు కరపత్రాలతో నిరసన వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్టౌన్, జూన్ 10: జిల్లా కేంద్రంలో రిమ్స్లో అన్ని విభాగాల్లో పని చేస్తున్న కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గురువారం రిమ్స్ ఓపీ బ్లాక్ ఎదుట సీఐటీయూ నాయకులు కరపత్రాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి కిరణ్ రిమ్స్ ఔట్ సోర్సింగ్ నాయకులు మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోను విధులు నిర్వహిస్తూ వైద్యులకు తమవంతు సహాకారాన్ని అందించిన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా కరోనా టీకా ఉత్పత్తిని వేగం పెంచడంతో పాటు వారికి అంది ంచాలని, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి అందరికి ఉచిత టీకాలు వేయాలని డిమాండ్ చేశారు. ఫ్రంట్లైన్ వర్కర్స్కు రూ.50లక్షల భీమా వర్తించాలని, కరోనా కాలంలో డ్యూటీ చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలర్ చేయాలని కోరారు.