మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభ్యం

ABN , First Publish Date - 2022-08-19T06:23:12+05:30 IST

మండల పరిధిలోని చింతచెట్టు గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభ్యం

కొండమల్లేపల్లి, ఆగస్టు 18: మండల పరిధిలోని చింతచెట్టు గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. కొండమల్లేప ల్లి ఎస్‌ఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండకు చెందిన చిలువేరు బాబు(48) ఫర్టిలైజర్‌ వ్యాపారం చేస్తుండేవారు. వ్యాపారంలో నష్టంరావడంతో సంవత్సరంక్రి తం తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని విక్రయించి కొండమల్లేపల్లికి మకాం మార్చాడు. కొండమల్లేపల్లిలో ని నల్లగొండ రోడ్డులో కట్టిన ఇంటిని కొనుగోలుచేసి నివాసముంటున్నాడు. తన ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున 10 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇంటి నుంచి వెళ్లిన రెండు రోజులకు భార్య కొండమల్లేపల్లి పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశారు. అయితే బుధవారం మండలంలోని చింతచెట్టు గ్రా మపంచాయతీ పరిధిలో మృతదేహమై కన్పించాడు. బాబు ఆచూకీ కోసం విచారణ చేపడుతుండగా, బుధవారం గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం చేరవేశారు. అ నంతరం గురువారం మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించారు. చిలువేరు బాబుకు భార్య రమాదేవితోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. 


Updated Date - 2022-08-19T06:23:12+05:30 IST