అనుమానాస్పద స్థితిలో కంపెనీ కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2021-04-19T05:42:29+05:30 IST

కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన మనోహరాబాద్‌ మండలం చెట్లగౌరారంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.

అనుమానాస్పద స్థితిలో కంపెనీ కార్మికుడి మృతి

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), ఏప్రిల్‌ 18: కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన మనోహరాబాద్‌ మండలం చెట్లగౌరారంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. మనోహరాబాద్‌ ఎస్‌ఐ రాజుగౌడ్‌ కథనం ప్రకారం.. బీహార్‌లోని బక్సర్‌ జిల్లా శాంతినగర్‌కు చెందిన బిచ్చురామ్‌(42) ఐదేళ్లుగా ఎంఎస్‌ అగర్వాల్‌ ఫౌండ్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి భోజనం చేసిన తరువాత బిచ్చురామ్‌ అకస్మాత్తుగా నేలపై కూలిపోయాడు. అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌లోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కంపెనీ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఎండీ మజ్‌ఫర్‌జావీద్‌ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజుగౌడ్‌ తెలిపారు.


 

Updated Date - 2021-04-19T05:42:29+05:30 IST