పొలంలో బురదగుంటలో 16 ఏళ్ల బాలిక మృతదేహం.. అర్ధరాత్రి జరిగిన దారుణం..

ABN , First Publish Date - 2021-08-05T17:22:41+05:30 IST

రోడ్డు పక్కన బురదగుంటలో దొరికిన 16 ఏళ్ల బాలిక మృతదేహం రాజస్థాన్‌లోని ఢోలాపూర్ ప్రాంతంలో కలకలం సృష్టించింది.

పొలంలో బురదగుంటలో 16 ఏళ్ల బాలిక మృతదేహం.. అర్ధరాత్రి జరిగిన దారుణం..

రోడ్డు పక్కన బురదగుంటలో దొరికిన 16 ఏళ్ల బాలిక మృతదేహం రాజస్థాన్‌లోని ఢోలాపూర్ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఎవరో ఆమెను గొంతు నులిమి చంపేసి మృతదేహాన్ని అక్కడకు తీసుకొచ్చి పడేశారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ కోసం ఆస్పత్రికి తరలించారు. రాజస్థాన్‌లోని ఢోలాపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.


ఢిహౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొరేనా రోడ్డు పక్కన ఓ యువతి మృతదేహం ఉన్నట్టు బుధవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆమె మెడ చుట్టూ ఓ తాడు ఉంది. తాడు సహాయంతో ఎవరో ఆమెను చంపేసి అర్ధరాత్రి సమయంలో అక్కడకు తీసుకొచ్చి పడేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆమె ఎవరనే విషయం పోలీసులకు అంతుబట్టడం లేదు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. హంతకుడి గురించి గాలిస్తున్నారు. 


Updated Date - 2021-08-05T17:22:41+05:30 IST