కేసీఆర్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి: Tarun Chugh
ABN , First Publish Date - 2022-06-25T21:25:38+05:30 IST
Hyderabad: తెలంగాణ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు తెలంగాణ బీజేపీ ఇన్చార్జ్ తరుణ్ చుగ్. తెలంగాణలో జంతర్ మంతర్ .. తాంత్రిక్ సర్కార్
Hyderabad: తెలంగాణ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు తెలంగాణ బీజేపీ ఇన్చార్జ్ తరుణ్ చుగ్. తెలంగాణలో జంతర్ మంతర్ .. తాంత్రిక్ సర్కార్ నడుస్తోందన్నారు. యువత, మహిళలు, కిసాన్, ఎస్సీ ఎస్టీ వర్గాలు కేసీఆర్ పాలనపై విసుగెత్తాయన్నారు. సీఎం కేసీఆర్ సర్కారుకు ప్రజలు బైబై చెప్పే రోజు ఎంతో దూరం లేదన్నారు. మరో 529 రోజుల తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని చెబుతూ..‘‘సాలు దొర.. సెలవు దొర’’ (www.selavudora.com).. కేసీఆర్కు కౌంట్ డౌన్ వెబ్సైట్ ను తరుణ్ చుగ్ ప్రారంభించారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. సచివాలయానికి ఎందుకు పోవటం లేదో కేసీఆర్ చెప్పగలడా? దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య ఎక్కడ? అని ప్రశ్నించారు.
జులై 2,3వ తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
‘‘జులై 2,3వ తేదీల్లో నిర్వహించే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు 340 ప్రతినిధులు హాజరవుతారు. జులై 2న ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకుంటారు. జేపీ నడ్డా ఒకటో తేదీన వస్తున్నారు. బూత్, గ్రామస్తాయి కార్యకర్తలు మోదీ సభకు తరలిరావాలి. ప్రధాని సభ తెలంగాణ రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్ కాబోతుంది’’ అని తరుణ్ చుగ్ తెలిపారు.